అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం తెలిపారు. ప్రతి పరీక్షకేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పరిసరాల్లో ప్రజలు గుమిగూడకుండా 144సెక్షన్ కఠినంగా అమలు చేసినట్లు తెలిపారు.