ADB: గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్ వంటి పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతుల కృషి చేస్తానని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.