KRNL: కర్నూలు సమీపంలోని గార్గేయపురంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తల్లి రాజేశ్వరి(35) తన ఇద్దరు కుమారులైన అబ్రహం (3)సుకుమార్ (6)లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యభర్తల మధ్య కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు, తెలియాల్సి ఉంది.