KRNL: బేతంచెర్ల మండలం బలపాలపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో డైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురికినీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురికి నీటితో దుర్వాసన, దోమల బెడద పెరిగి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే డ్రైనేజీని శుభ్రం చేయించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.