KRNL: పెద్దకడుబూరులో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో స్వచ్ఛ రథం వాహనాన్ని టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో పరిశుభ్రత, వ్యర్థాల సక్రమ నిర్వహణకు వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రజలు పరిశుభ్రతపై మరింత అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.