ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ హజరతయ్య రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై వాహనదారులకు, మహిళలకు శుక్రవారం అవగాహన కల్పించారు. వాహనాలకు సరైన పత్రాలు లేని వారిని, డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిని, హెల్మెట్లు ధరించని వారిని గుర్తించి వారికి జరిమానా విధించారు. అనంతరం వారికి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై కౌన్సెలింగ్ ఇచ్చారు.