TPT: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ బాగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 67,264 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 29,410 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది.