VZM: ఈనెల 16 నుంచి జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని DEO మాణిక్యంనాయుడు శుక్రవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలు లేని పాఠశాలలు ఉదయం 8 నుంచి 12:30 వరకు నిర్వహించి మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను పంపించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు భోజనం అనంతరం ఒంటి గంట నుంచి 5 వరకు నిర్వహించాలన్నారు.