అన్నమయ్య: వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి గురు అరవింద్ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు రుణాలు తదితర రాజీ కుదిరే కేసులను లోక్అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. పోలీసు అధికారులు,న్యాయవాదులు సహకరించి ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు.