కృష్ణా: గన్నవరం మండలం సూరంపల్లిలో సీఎం చంద్రబాబు శుక్రవారం యువ రైతు తుళిమిల్లి లక్ష్మణరావు పొలాన్ని సందర్శించారు. పంటల్లో డ్రోన్ వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. సాంప్రదాయ పిచికారీతో పోలిస్తే డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల సమయం, శ్రమ ఎంత మేర తగ్గుతుందో రైతును అడిగి తెలుసుకుని ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించాలని సూచించారు.