AP: ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. ‘పొగాకు, కోకో, ఉల్లి, టమాటా రైతులను ఆదుకున్నాం. ఇప్పటివరకు రూ.1,338 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రాష్ట్రాభివృద్ధిలో రైతులది కీలక పాత్ర. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వాడేలా ప్రోత్సహిస్తున్నాం’ అని వెల్లడించారు.