NLR: నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ ప్రణాళిక పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని కమిషనర్ వై.ఓ నందన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నక్ష సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సర్వేలో 30% కన్నా తక్కువ పురోగతి ఉన్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.