KRNL: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నాడని TDP ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఇవాళ పెద్దకడబూరులో అన్నదాత సుఖీభవ- PM కిసాన్ 3వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 41,992 మంది రైతులకు గాను రూ. 23.85 కోట్లు మంజూరు కాగా.. పెద్దకడబూరు మండలానికి 9,662 మంది రైతులకు రూ.5.58 కోట్లు మంజూరయ్యాయి.