BDK: బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పీఎస్పీడీ సిఎస్ఆర్ నిధుల నుండి రూ.50 లక్షల వ్యయంతో మంజూరైన సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. మండలంలో ఐటీసీ సంస్థ ఉండడం మండల ప్రజల అదృష్టమని అన్నారు. ఐటీసీ సీఎస్ఆర్ నిధుల ద్వారా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.