KDP: యోగి వేమన విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవాన్ని క్యాంపస్లో నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ ఆర్ఎస్ఎఫ్, వైవియు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. శుక్రవారం వైవియు ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్కు తరలించారు.