JGL: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియకముందే ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. గత కొన్ని నెలల క్రితమే వారు రాజీనామా చేసినప్పటికీ దానికి గల కారణాలను ఆలయ అధికారులు లేదా మండలి సభ్యులు ఇప్పటివరకు వెల్లడించలేదు. కొత్త ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఎప్పడు నియమిస్తారనేది ఆసక్తి నెలకొంది.