ప్రకాశం: పామూరు మండలం నుచ్చుపొద గ్రామంలో నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల అమలుపై అధికారులతో చర్చించి రైతులకు అందుతున్న ప్రయోజనాలపై వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.