తూ.గో జిల్లా పరిధిలోని రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ & పీఎం కిసాన్ యోజన పథకాల కింద గణనీయమైన ఆర్థిక సహాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం జరిగిందన్నారు. వివిధ నియోజకవర్గాల పరిధిలో MLA, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.