GDWL: ప్రజా పాలన ప్రగతి ప్రాణాలికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపులు సామాన్యులకు వరం అని సర్పంచ్ మహేశ్వరమ్మ అన్నారు. శుక్రవారం ధరూరు మండలం ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జి. రాజు ఆధ్వర్యంలో ఓ వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్ వంటి వివిధ విభాగాల స్పెషలిస్టులు 152 మంది రోగులను పరీక్షించి మందుల అందించారు.