GDWL: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వర్గానికి మరణ శాసనాలు అని ఐఎఫ్టీయూ గద్వాల జిల్లా కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 16న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న మహాధర్నా గోడ పత్రికలను శుక్రవారం గద్వాలలో పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు ఐఎఫ్టీయూ నేతలు పాల్గొన్నారు.