SDPT: కేంద్ర పట్టు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోదాన్ పోచంపల్లిలో జరిగిన పట్టు కృషి మేళాలో సిద్దిపేట జిల్లాలోని ఉత్తమ పట్టు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అవార్డులను అందజేసి శాలువాలతో సన్మానించారు. ఉత్తమ రైతులుగా శ్రీనివాస్, నర్సింలు, రాజు, నారాయణరెడ్డి జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు.