BPT: శాలివాహన (కుమ్మరి) సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘీయులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘీయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.