GDWL: ధరూర్ మండలంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఉప్పెర్, మార్లబీడు, ధరూర్ పరీక్షా కేంద్రాలను ఎంఈవో రవీంద్రబాబు శుక్రవారం సందర్శించారు. పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆయన తెలిపారు. పారదర్శకత కోసం ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.