కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రులో నిర్వహించిన జాతీయ కృత్రిమ గర్భాధారణ అవగాహన సదస్సు, లేగ దూడల అందాల పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేగ దూడల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశు సంపదను కాపాడుకోవడం ద్వారానే స్వచ్ఛమైన పాలు పొంది, కల్తీని నివారించవచ్చన్నారు.