NDL: ఆళ్లగడ్డలోని సుంకులమ్మ వీధిలో సబ్ యూనిట్ అధికారి శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ నీటి గచ్చులను పరిశీలించి దోమల లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాలని అయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై కరపత్రాలు పంపిణీ చేశారు.