BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినృసింహుడి సన్నిధిలో శుక్రవారం ఉదయం లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వయంభూ మూర్తులను నిజాభిషేకం అనంతరం పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లకు లక్ష నామ స్తోత్రాలతో కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.