VKB: ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిస్తామని మైనారిటీ నాయకుడు ఎస్ఎం.గౌసన్ అన్నారు. కొడంగల్లో రోడ్డు విస్తరణలో అక్రమంగా తొలగించిన మహిబూబ్ సుభాని దర్గాను యథా స్థానంలో పునః నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చినా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.