సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బోర్డర్ 2’ OTT రిలీజ్ డేట్ ఖరారైంది. జనవరిలో విడుదలై విజయం సాధించిన ఈ దేశభక్తి మూవీ మార్చి 20 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. 1997 నాటి క్లాసిక్ ‘బోర్డర్’కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించాడు. యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్.