ELR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తణుకు హైవే నుంచి ఏలూరు వైపు వస్తుండగా షణ్ముఖ, నవీన్, చరణ్ తేజ్, అరవింద్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5.320 కేజీల గంజాయి, నాలుగు మోటర్ సైకిలు, వెండి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు DSP శ్రావణ్ కుమార్ తెలిపారు.