SDPT: పుల్లూరు గ్రామంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వంగ రాజేశ్వర్ రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన, పంట పొలాలను పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సాగునీటి విడుదలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు గ్రామ రైతులు రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.