KRNL: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై గురువారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. మండల ఎంపీపీ వెంకటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో నీటి కొరత నివారణకు, పారిశుద్ధ్య కార్యక్రమాల సమర్థ అమలుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. ఎండాకాలం సమీపిస్తున్న సందర్భంగా నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.