VKB: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో నర్సింగ్ రావు తెలిపారు. మూడు కేంద్రాల్లో మొత్తం 568 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. జడ్పీ బాలుర పాఠశాల (200 మంది), బాలికల పాఠశాల (188), మంబాపూర్ పాఠశాల (180) మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన పేర్కొన్నారు.