ATP: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు 162 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 164 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. వీరితో పాటు 9 మంది అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, 1941 మంది ఇన్విజిలేటర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.