MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పేర్కొన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచుతానని చెప్పి విస్మరించారన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మందకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.