JN: ప్రస్తుత సమాజాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు తమ ప్రతిభను మరింతగా వెలుగులోకి తీసుకొని వచ్చి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.