సత్యసాయి: ధర్మవరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి కార్యాలయ ఇంఛార్జ్ హరీష్ బాబు అధికారులను ఆదేశించారు. మంత్రి సత్యకుమార్ సూచన మేరకు గురువారం పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్, జి.వి.ఇ. పాఠశాలలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా గదుల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వసతులపై దిశానిర్దేశం చేశారు.