NGKL: జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు.