BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలో గురువారం SI పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కులం, మతం, వర్గాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంటుందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.