NGKL: వంగూరు మండలం కోనాపూర్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పశు వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వీటి వల్ల పశువులకు ప్రాణాంతక గాలికుంటు వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.