కృష్ణా: రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని బెదిరించి రూ.75 వేల నగదు బలవంతంగా బదిలీ చేయించుకున్న ఘటనపై H.జంక్షన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొయ్యూరుకు చెందిన శ్యామ శంకర్ ఫిర్యాదుతో సురేష్, రవి, సుధీర్లపై కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతని వద్దకు వెళ్లి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నావని, నీపై రౌడీషీట్ తెరిపిస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారు.