NZB: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ‘సెన్సెస్-2027’ శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగానే భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.