ADB: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన నార్నూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని ఎంపల్లి గ్రామానికి చెందిన సెడ్మకి మారుతీరావు(57) బుధవారం మండల కేంద్రంలోని వారపుసంతకు వస్తుండగా ఒక్కసారిగా వడదెబ్బ తగిలింది. ఈ మేరకు ఆయనను కుటుంబ సభ్యులు ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మారుతీరావు మృతి చెందారన్నారు.