CTR: జిల్లాలో రైతులకు రూ. 115.81 కోట్ల లబ్ధి చేకూరింది. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు జమ కానున్నాయి. అందులో రూ. 2 వేల చొప్పున రూ. 33.51 కోట్లు విడుదల కానున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున 2,05,753 మంది రైతులకు రూ. 82.30 కోట్లు విడుదల చేయనుంది.