RR: నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులలో భాగంగా చేవెళ్ల పరిధిలోని అంతారం గ్రామ పంచాయతీకి చెందిన బోరుబావి తొలగిపోయిందని సర్పంచ్ రామస్వామి అన్నారు. గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడటంతో ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ ప్రజల అవసరార్థం కొత్త బోరు బావి ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.