NTR: విజయవాడ పశ్చిమంలోని చిట్టినగర్ కొత్తపేటకు చెందిన మేదర హర్షిత UPSC సివిల్ సర్వీస్ పరీక్షల్లో 520వ ర్యాంక్ సాధించారు. బుధవారం ఆమెను జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు స్వగృహంలో సత్కరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయ రహస్యం అని హర్షిత చెప్పారు. ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న తన తండ్రి సుధాకర్ ప్రజలకు సేవ చేస్తున్న తీరు తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు.