ASR: అనంతగిరి మండలంలో బొర్రా గుహలుకు వెళ్లే మార్గంలో గేటువలస వద్ద ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన కింద భాగంలోని సైడ్ దిమ్మలు దెబ్బతినడంతో వాహనాలు వెళ్లే సమయంలో కదలికల శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు గుహలను దర్శించేందుకు వచ్చే పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. వంతెన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.