సత్యసాయి: కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో జరిగిన ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బుధవారం భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. కాలు పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తికి రూ.5 లక్షలు, మిగిలిన ఐదుగురికి రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తామని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఆలయంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.