కోనసీమ: ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి వారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 5 నెలల 3 రోజులకు గాను ప్రధాన హుండీల ద్వారా రూ. 9,52,522, అన్నదాన హుండీల ద్వారా రూ.4,45,990 మొత్తంగా రూ.13,98,512 ఆదాయం వచ్చిందని ఈవో నరేంద్ర కుమార్ తెలిపారు.