BPT: కొరిశపాడు మండల హౌసింగ్ ఇంఛార్జ్ ఏఈగా కిషోర్ బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా DE దుర్గా రమేష్ చేతుల మీదగా ఆయన ఆర్డర్ కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ సిబ్బంది అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని ఏఈ కిషోర్ మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తానన్నారు.