KMR: నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి ఎస్టీ మహిళా గురుకుల పాఠశాలను బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలో సరుకులను, విద్యార్థులకు ఆహారం అందించే తీరును ఆమె పరిశీలించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారికి నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్కు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ సువర్ణ ఉన్నారు.